ఏపీ రైతులకు శుభవార్త. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. కడప జిల్లా కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధులను జమ చేస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. .. .. ..
ఏపీ రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైంది. కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అదే రోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తోంది. కేంద్రం నుంచి రూ.2,000, రాష్ట్రం నుంచి రూ.5,000.. మొత్తం రూ.7,000 సాయం రైతులకు అందనుంది. రెండో విడతలో మొత్తం 46 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
Please follow and like us:

