ఏపీలో బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కువరనున్నాయి. గురువారం ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు బుధవారం నుంచి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు తెలంగాణలోనూ ఉపరితల ఆవర్తనం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ మూడు రోజులు అవసరమైతేతప్ప బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ హైడ్రా చర్యలు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కాలేజీలకు బుధవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోం కల్పించేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని సూచించింది.
ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు
Please follow and like us: