ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?

ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?

పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ లు దిద్దడం టీచర్ లకు ఒక పరీక్ష లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులతో అవసరం లేదు. అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ పేపర్లను కూడా ఏఐ దిద్దుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అందుబాటులోకి వచ్చింది.

పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ లు దిద్దడం టీచర్ లకు ఒక పరీక్ష లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులతో అవసరం లేదు. అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ పేపర్లను కూడా ఏఐ దిద్దుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ శివరాంపల్లిలోని గాయత్రి హైస్కూల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఏఐ టెక్నాలజీతో ఎగ్జామ్ పేపర్లను దిద్దుతున్నారు.

పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్ష పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సహకారంతో దిద్దే సాఫ్ట్‌వేర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. పాఠశాలల్లో పరీక్ష పేపర్లు దిద్దాలంటే ఉపాధ్యాయులకు తలనొప్పిగా ఉండేది. ఎక్కువ సమయం పరీక్షా పేపర్లను దిద్దడానికే కేటాయించాల్సి వస్తుంది. నెల పరీక్షలు మొదలుకొని క్వార్టర్లకీ, హాఫ్ ఇయర్లీ, వార్షిక పరీక్షలకు విద్యార్థులు రాసిన పేపర్లు దిద్దాలంటే ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం మార్కెట్లోకి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటు లోకి వచ్చింది. దీంతో ఉపాధ్యాయుల పనిభారం కూడా తగ్గుతోందంటున్నా పాఠశాల నిర్వాహకులు.

ఇందుకోసం www.grademe.ai.com అనే టెక్నాలజీని రూపొందించారు. దీని ద్వారా తరగతిలో ఉండే 50 మంది విద్యార్థుల పరీక్ష పత్రాలను రెండు నుంచి ఐదు నిమిషాలలోపు దిద్ది మార్కులు ఇచ్చే విధంగా ‘గ్రేడ్ మీ ఏఐ’ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుంది. పరీక్ష పత్రాలను దిద్ది మార్కులు వేయడమే కాకుండా, ఎక్కడ తప్పు జరిగింది. ఎలా సరిదిద్దుకోవాలో కూడా ఈ సాఫ్ట్‌వేర్ సూచిస్తుంది. దీని ద్వారా ఉపాధ్యాయులకు విద్యార్థుల పరీక్ష పత్రాలను దిద్దడం ఈజీగా మారింది.

శివరాంపల్లిలోని శ్రీగాయత్రి హైస్కూల్లో ‘గ్రేడ్ మీ ఏఐ’ ద్వారా పరీక్ష పత్రాలను దిద్దే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభించారు. విద్యార్థులకు ఇచ్చిన పరీక్ష పత్రాన్ని ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. తర్వాత విద్యార్థులు రాసిన జవాబు పత్రాన్ని ఫొటో తీసి అప్ లోడ్ చేస్తే ఒకటి నుంచి రెండు నిమిషాలలోపు జవాబు పత్రాన్ని కరెక్షన్ చేసి మార్కులు ఇస్తుంది. దాంతో పాటు ఎక్కడ పొరపాటు జరిగింది.. ఎలా సరిదిద్దుకోవాలో కూడా సూచిస్తుంది. ఈ విధానం చాలా బాగుందని శ్రీగాయత్రి హైస్కూల్ యాజమాన్యం అంటుంది.

అమెరికాకు చెందిన ఉదయ్ మెహతా సారధ్యంలో అర్వాంచ్ అనే కంపెనీ పేరుతో ‘గ్రేడ్ మీ ఏఐ’ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా పరీక్ష పత్రాలను చాలా సులభంగా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో దిద్దవచ్చంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉంది. భారతదేశంలో కూడా ‘గ్రేడ్ మీ ఏఐ’ను విస్తరిస్తున్నట్లు శ్రీగాయత్రి హైస్కూల్ ప్రతినిధులు తెలిపారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు