పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకూ రోజుకొక ముక్క తింటే చాలు.. నీరసం, అలసట దెబ్బకు పరార్

పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకూ రోజుకొక ముక్క తింటే చాలు.. నీరసం, అలసట దెబ్బకు పరార్

ఈ రెసిపీని సరైన కొలతలతో చేసి తింటే, నీరసం, అలసట ఒక్కరోజులోనే పోతాయి. వేడి మీద ఉన్నప్పుడే ముక్కలు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం చల్లారిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి. మరి, ఇంకేందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం ..

బెల్లం, బాదం, పల్లీల పప్పు చెక్క రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బెల్లం, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు బాదం, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక గ్లాస్ నీరును తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేసి తింటే, నీరసం, అలసట ఒక్కరోజులోనే పోతాయి

పల్లీలు, బాదంను ఇలా వేయించాలి: ముందుగా గ్యాస్ పొయ్యి మీద పాన్ పెట్టి, అది బాగా వేడయ్యాక పల్లీలను కూడా వేసి మీడియం మంటపై వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసి ముద్దలాగా చేసుకోవాలి. అలాగే, బాదంను కూడా దీనితో వేయించి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి.

ముందుగా బెల్లం పాకాన్ని ఇలా తయారు చేసుకోవాలి: ముందుగా పాన్‌లో తురిమిన బెల్లం వేసి, దానిలో ఒక గ్లాస్ నీరు పోసి వాటిని బాగా కరిగించాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వాటిని వడకట్టి వాటిని స్టవ్‌ మీద పెట్టాలి. ఇప్పుడు పాకంలాగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి.

ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి: ఆ తరవాత బెల్లం పాకంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి దీనిలో బాగా కలపాలి. ఆ తర్వాత పల్లీలు, బాదం ముక్కలు వేసి మిక్స్ అయ్యేలా దీనిని బాగా కలపాలి. ఆ తరవాత దీనిని చెక్కలుగా చేసుకోవాలి.

చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి : ఇక చివర్లో ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని పోసి గరిటెతో మంచిగా చేసుకోవాలి. ఇంకా చల్లారిన తర్వాత చాక్ తో వీటిని చెక్కల ఆకారంలో చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు ముక్కలు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం చల్లారిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి.

Please follow and like us:
లైఫ్ స్టైల్ వార్తలు