మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా మరో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో మరింత స్పీడ్ పెంచారు మేకర్స్. అయితే కన్నప్ప సినిమా వార్తల మధ్య ఒక ఆసక్తికర విషయం నెట్టింట బాగా వైరలవుతోంది.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన కన్నప్ప సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం (జూన్ 27)న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు ఇంకా మూడు రోజులే ఉండడంతో కన్నప్ప ప్రమోషన్లు ఊపందుకున్నాయి. మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు కూడా ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇద్దరూ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఇటీవల మోహన్ బాబు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో మోహన్ బాబు, విష్ణు న్యూజిలాండ్ లో సముద్రం పక్కన ఉన్న ఓ సువిశాలమైన మైదానంలో తిరుగుతూ.. ‘ఇదంతా నాదే.. న్యూజిలాండ్లో 7 వేల ఎకరాలు కొన్నాం. పక్కనే ఉన్న సముద్రం కూడా మంచు విష్ణుదే’ అని మోహన్ బాబు సరదాగా చెబుతాడు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. మోహన్ బాబు సరదాగా చేసిన ఆ కామెంట్స్ నెట్టింట బాగా వైరలయ్యాయి. నిజంగానే మోహన్ బాబు న్యూజిలాండ్లో స్థలాలు కొన్నారు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయంపై నటుడు బ్రహ్మాజీ క్లారిటీ ఇచ్చాడు.
‘ఏదో సరదాగా జోక్గా చేసిన వ్యాఖ్యలను కూడా ఇంత సీరియస్గా తీసుకుంటారా. ఫన్ కోసమే ఆ వీడియో చేశాం. న్యూజిలాండ్లో 7 వేల ఎకరాలు కొన్నామని మోహన్ బాబు సరదాగా అన్నారు. అక్కడి పర్వతాలు కూడా కొన్నామని జోక్ చేశాడు. కానీ సడెన్గా నిజంగానే అక్కడ 7 వేల ఎకరాలు కొన్నారని వార్తలు రాసేస్తున్నారు. అరే భాయ్.. న్యూజిలాండ్లో 7 వేల ఎకరాలు కొనడం అంత ఈజీనా? షూటింగ్ కోసం మాత్రమే అక్కడి వెళ్లాం అంతే. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. . నాన్ సిటీజెన్స్కు న్యూజిలాండ్లో స్థలాలు అమ్మరు. అక్కడి సిటిజన్స్కి మాత్రమే స్థలాలు కొనే హక్కు ఉంది. సరదా సంభాషణలను సీరియస్గా తీసుకోకండి. ఇప్పుడు నవ్వుకోండి. కానీ కామెడీని మరోలా మార్చి చెప్పకండి’ అని బ్రహ్మాజీ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. కాగా ఈ విషయంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.