మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళవారం (జూన్ 17) అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు..
వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళవారం (జూన్ 17) అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు అప్పగించారు. అక్కడి నుంచి మూడు వాహనాల్లో బెంగళూరు నుంచి మంగళగిరికి తరలించేందుకు ఏపీ పోలీసులు బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన పాస్ పోర్ట్ కూడా ఏపీ పోలీసులకు.. కర్ణాటక పోలీసులు అందజేశారు.
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు నుంచి శ్రీలంకలోని కొలంబో వెళ్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు మంగళవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి ఎయిర్ పోర్టు పోలీస్ స్టేసన్కు తరలించారు. కాగా ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు 200 మందికిపైగా సిట్ విచారించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో సిట్ అధికారులు బాస్కర్ రెడ్డిని ఏ-38గా పేర్కొంది. ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాల్యమిత్రుడు, సన్నిహితుడైన వెంకటేశ్ నాయుడినీ సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-34గా వెంటేశ్ నాయుడిని సిట్ చేర్చింది. చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడిపై లుక్ అవుట్ సర్క్యులర్లు ఉండడంతో వీరిద్దరినీ బెంగళూరు ఎయిర్పోర్టు సిబ్బంధి నిర్బంధించి, ఆ సమాచారాన్ని సిట్ అధికారులకు తెలియజేశారు. సిట్ బృందాలు బెంగళూరు వెళ్లి, బుధవారం వేకువజామున వారిద్దరినీ అరెస్టు చేశాయి. చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడి అరెస్టుతో మద్యం కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిది మందికి చేరింది. బుధవారం చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడి విజయవాడ సిట్ కార్యాలయంకు తీసుకొచ్చి, అనంతరం ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరు పరచనున్నారు.