ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల రాక, ఉపరితల ఆవర్తల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని ఏర్కొంది. ఆ తర్వాతి రోజుల్లు ఉష్ణోగ్రతలు కూడా 3-4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్కు మరోసారి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ సోమవారం మే 18, 2026న ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాలకు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, మొత్తం అండమాన్ అండ్ నికోబార్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు దగ్గరగా చేరుకున్నాయని స్పష్టం చేసింది.
రాబోయే 3-4 రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమొరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని. దీంతో మే 24 నాటికే అంటే 4 రోజుల ముందుగానే ఈసారి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్,. దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి ఉందని. ద్రోణి అంతరాయం , దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి, కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని తెలిపింది.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది..అలాగే ఈ వర్షాల సమయంలో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగముతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోనూ రాబోయే 3 ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అలాగే కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలో మంగళవారం వేడి , తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముందని తెలిపారు. ఆ తరువాత 5 రొజుల్లో వడగాలులు ఒకట లేదా రెండు చోట్ల వీచే అవకాశముందరి. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు కావచ్చని తెలిపారు.

