పసిడి ప్రియులకు ఇదే మంచి ఛాన్స్‌..! మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

పసిడి ప్రియులకు ఇదే మంచి ఛాన్స్‌..! మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,163లుగా ఉంది. అయితే, బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావమే అంటున్నారు విశ్లేషకులు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ప్రధానంగా డాలర్ బలపడటంతో పాటు స్టాక్ మార్కెట్లు బలపడటం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక పరోక్ష కారణంగా చెప్పవచ్చు.

బంగారం కొనేందుకు ఇవి మంచి రోజులే అనిపిస్తోంది. ఎదుకంటే గత నాలుగు రోజులుగా బంగారం ధరలు ఊహించని విధంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర మరింత తగ్గినట్లు కనిపిస్తోంది. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.9,550లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.8,754లుగా ఉంది. ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,163లుగా ఉంది. అయితే, బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావమే అంటున్నారు విశ్లేషకులు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ప్రధానంగా డాలర్ బలపడటంతో పాటు స్టాక్ మార్కెట్లు బలపడటం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక పరోక్ష కారణంగా చెప్పవచ్చు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,690, 24 క్యారెట్ల ధర రూ.95,650 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల రేటు రూ.95,500 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా 4ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా ఉంది.

వెండి ధరలు..

ఇకపోతే, బంగారంతో పాటుగా వెండికి కూడా ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. సిల్వర్‌ నగల కోసం మాత్రమే కాదు పారిశ్రామికంగా కూడా పెద్ద ఎత్తున వినియోగమవుతుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వినియోగదారు మన దేశమే అంటున్నారు నిపుణులు. బంగారంలాగే వెండి కూడా పెట్టుబడి మార్గంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాలతో పాటు ప్రధాన భారతీయ నగరాల్లో తాజా వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి వెండి ధర గ్రాము రూ.108.90లు కాగా, కిలో వెండి ధర రూ. 1,08,900లుగా ఉంది.

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,08,900

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,08,000

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.97,900

ముంబైలో రూ.97,900

బెంగళూరులో రూ.97,900

చెన్నైలో రూ.1,08,000 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు