జగన్‌ తెనాలి పర్యటనపై పొలిటికల్ హీట్.. ఒకరిపై ఒకరు కౌంటర్!

జగన్‌ తెనాలి పర్యటనపై పొలిటికల్ హీట్.. ఒకరిపై ఒకరు కౌంటర్!

ఇటు మరో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల కూడా జగన్‌ తెనాలి పర్యటనపై ఫైర్ అయ్యారు. రఘురామకృష్ణంరాజుపై దాడి చేసిన వాళ్లను ఏం చేయాలన్నారు..? జగన్‌ తెనాలి వెళ్లి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు జనసేన నేతలు కూడా..

వైసీపీ అధినేత జగన్‌ తెనాలి పర్యటన పొలిటికల్‌ హీట్‌ పెంచింది. కేసులున్నంత మాత్రాన రోడ్డుమీదే కొడతారా..? అమాయకులను రౌడీషీటర్లుగా చిత్రీకరిస్తారా…? అంటూ వైసీపీ ఆగ్రహావేశాలు వెల్లగక్కుతుంటే.. రౌడీలున్న పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్‌ ఎటాక్‌కి దిగారు కూటమి నేతలు. కేసులుంటే రోడ్లపైనే కర్రలతో కొడతారా..? చంద్రబాబుపైనా 24 కేసులున్నాయ్‌.. ఆయన విషయంలోనూ ఇలాగే ప్రవర్తిస్తారా ?అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్‌. దళితులను కొట్టి రౌడీషీటర్లుగా ముద్రవేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారాయన. ప్రభుత్వ పద్దతి అసలేం బాలేదన్నారు.

ఏపీలో అరాచక పాలన నడుస్తోందన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమాయకులను కొడితే ఏమొస్తుందన్నారు..? గుర్తుపెట్టుకోండి లెక్కకు లెక్క తేలుస్తామంటూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు.

అలాగే వైసీపీ నేతల మాటలకు ఇటు కూటమి పార్టీల నేతలు కూడా తగ్గేదేలే అన్నట్లు కౌంటర్‌ ఎటాక్‌కి దిగారు. నందిగం సురేష్‌, బోరుగడ్డ అనిల్‌ లాంటి రౌడీలున్న పార్టీ వైసీపీ అంటూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ విమర్శలు గుప్పించారు.

ఇటు మరో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల కూడా జగన్‌ తెనాలి పర్యటనపై ఫైర్ అయ్యారు. రఘురామకృష్ణంరాజుపై దాడి చేసిన వాళ్లను ఏం చేయాలన్నారు..? జగన్‌ తెనాలి వెళ్లి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు జనసేన నేతలు కూడా జగన్‌ పర్యటన, వైసీపీ నేతల కామెంట్స్‌పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఎంతోమందిని వేధించి.. ఆఖరికి డెడ్‌బాడీలు డోర్‌ డెలివరీ చేసిన వాళ్లకు మాట్లాడే అర్హతే లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా… జగన్‌ తెనాలి పర్యటన రాజకీయ రచ్చ లేపింది.

ప్రజల వద్దకే భూ పరిపాలన.. తెలంగాణలో అమల్లోకి వచ్చిన భూభారతి చట్టం..

ప్రజల వద్దకే భూ పరిపాలనంటూ రాష్ట్రవ్యాప్తంగా సదస్సులకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. భూములకు సంబంధించిన అన్ని సమస్యలకు భూభారతిలో సమాధానం దొరుకుతుందంటోంది ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో వేసి.. భూభారతిని తెచ్చామంటోంది. ఆగస్టు 15నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామంటోంది.

భూముల రిజిస్ట్రేషన్‌లో ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అంటోంది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. గతంలో ఉన్న ధరణి స్థానంలో నేటి భూ భారతి చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్‌ సర్కార్‌. ఇప్పటికే 4 మండలాల్లో భూ భారతి పైలెట్‌ ప్రాజెక్ట్‌ నిర్వహించారు. నేటి నుంచి ఈ నెల 20 వరకు ప్రజల దగ్గరకే రెవెన్యూ వ్యవస్థ కదిలి వెళుతుంది. ప్రతి గ్రామంలో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు అధికారులు. ఆగస్టు 15 నాటికి ఆ సమస్యలను ఉచితంగానే పరిష్కరిస్తారు. దీని కోసం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చిన సర్వేయర్లతో సర్వే నిర్వహిస్తారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020 అక్టోబర్‌ 29న ధరణి పోర్టల్‌ ప్రారంభమయింది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని నేతలు..భూములు ఆక్రమించుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు భూతగాదాలు కూడా పెరిగిపోయాయని.. వాటికి సంబంధించిన వివాదాలు గుట్టుగుట్టలుగా పెండింగ్‌లో పడ్డాయంటూ విమర్శలు వచ్చాయి. అలాగే ధరణి పోర్టల్‌ నిర్వాహణను ప్రైవేటు సంస్థకు ఇవ్వటం వల్ల.. ప్రజలకు సంబంధించిన సమాచారానికి గోప్యత లేకుండా పోయిందని.. దీని వల్ల చాలా అక్రమాలకు ధరణి పోర్టల్ కారణమైందంటూ ఆరోణపలు వెల్లువెత్తాయి.

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అజెండాగా మారింది ధరణి పోర్టల్. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ నిర్వాహణను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్‌లో ఉన్న పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించింది.

ఇక ధరణి పోర్టల్‎కి భూభారతి పోర్టల్‎కు నక్కకు నాగలోకానికి ఉన్నంతా తేడా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భూ భారతితో రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తున్నామన్నారు. జూన్ 20 తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థే గ్రామాలకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతిని తీసుకువచ్చామన్న పొంగులేటి వచ్చే ఎన్నికల్లో భూభారతి చట్ట తమ ప్రభుత్వానికి రెఫరెండమని స్పష్టం చేశారు.

20 వరకు సదస్సులు..
భూభారతి అమలులో భాగంగా ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది ప్రభుత్వం. తహసీల్దార్‌తో కూడిన బృందం గ్రామాల్లోకి వెళ్లి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించి, పరిష్కరిస్తుంది. పైలట్‌ ప్రాజెక్ట్ చేపట్టిన మండలాల్లో 55 వేల దరఖాస్తులు వస్తే.. అందులో 60శాతానికి పైగా పరిష్కరించామని చెప్తోంది ప్రభుత్వం. భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో డాక్యుమెంట్లతోపాటు సర్వే మ్యాపును జతపరుస్తోంది. రెండు, మూడు నెలల్ల 6వేల మంది సర్వేయర్లను నియమించి.. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామంటోంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు