గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల కాలంలో లక్ష మార్కు దాటేసిన బంగారం ధరలు.. ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదు. ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ.. స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి..
గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల కాలంలో లక్ష మార్కు దాటేసిన బంగారం ధరలు.. ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదు. ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ.. స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి.. వాస్తవానికి అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధర పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. 20 మే 2025 మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,520 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,560 గా ఉంది. వెండి కిలో ధర రూ.98,100 లుగా ఉంది. తులం బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,560, 24 క్యారెట్ల ధర రూ.95,520 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,560, 24 క్యారెట్ల ధర రూ.95,520 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,710, 24 క్యారెట్ల ధర రూ.95,670 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,560, 24 క్యారెట్ల ధర రూ.95,520 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,560, 24 క్యారెట్ల రేటు రూ.95,520 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,560, 24 క్యారెట్ల ధర రూ.95,520 గా ఉంది.