వీరికి దానిమ్మ వేరీ డేంజర్…! ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.. తిన్నారంటే..

వీరికి దానిమ్మ వేరీ డేంజర్…! ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.. తిన్నారంటే..

ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ఇందులోని పోషకాలు విటమిన్ సి, కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ లాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి సమృద్ధిగా అందిస్తుంది. జీవక్రియ, రోగ నిరోధక శక్తి మెరుగుపరచడానికి సహకరిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి.. కణ విభజన, రక్త పోటును నియంత్రించడానికి కూడా కీలకపాత్ర వహిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మెరిపిస్తుంది. రక్తహీనతను తరిమికొట్టి.. ఎర్ర రక్త కణాల నిర్మాణానికి తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా దానిమ్మ ఎంతగానో సహకరిస్తుంది. దానిమ్మ.. పండు, తొక్క, గింజలు, పూలు అన్నీ పోషకాలను ఇచ్చేవే. కానీ, కొంతమందికి దానిమ్మ సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు..దానిమ్మ ఎవరికి హానికరమో తెలుసుకుందాం.

చర్మ అలెర్జీ- మీకు అలెర్జీ సమస్యలు ఉంటే దానిమ్మ తినకూడదు. ఇలా చేయడం వల్ల మీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మపండు తినడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. చర్మ సంబంధ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండు తినడం వల్ల చర్మంపై మచ్చలు, అలెర్జీ వంటి సమస్యలు కలగవచ్చు.

తక్కువ రక్తపోటు ఉన్నవారు- తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా దానిమ్మపండు తినకూడదు. ఎందుకంటే దానిమ్మపండు చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇది మన శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్కువ రక్తపోటుకు మందులు తీసుకునే వ్యక్తులు దానిమ్మపండు తినడం వల్ల హాని కలుగుతుంది. ఎందుకంటే అందులో ఉండే మూలకాలు ఔషధంతో చర్య జరుపుతాయి. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది.

హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు ఉన్నవారు దానిమ్మ పండు తింటే రక్తపోటు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు దానిమ్మ పండు తీసుకోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతాయి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండు తింటే హార్మోన్ల అసమతుల్యతకు గురవుతారు. దానిమ్మపండును ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. ఎందుకంటే దీన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దానిమ్మను తినకూడదు. ముఖ్యంగా హై షుగర్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా దానిమ్మ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. దానిమ్మ పండులో నేచురల్ షుగర్లు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచే అవకాశం ఉంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవచ్చు.

అజీర్ణ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండు తింటే కడుపు ఉబ్బరం, అసౌకర్యం అనిపించే అవకాశం ఉంది. దానిమ్మలోని చల్లని స్వభావం కారణంగా, జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగదు. కాలేయ సంబంధ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండు తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు. గ్యాస్ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండు తింటే గ్యాస్ మరింత పెరిగే ప్రమాదం ఉంది.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు