వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊహించని ఆఫర్ ప్రకటించాడు.. ఆ పని చేసిన వారికి 25 వేల రూపాయల కానుక ఇస్తానని ప్రకటన చేశారు.. MLA నాయిని వ్యాఖ్యలు బ్రోకర్లు, ఫైరవీకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇంతకీ ఆ MLA ఎందుకలా నజరానా ప్రకటించారు..! ఎవర్ని పట్టించిన వారికి ఆ కానుకలో తెలుసా..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద ఎవరైనా లంచం తీసుకున్నా… ఇచ్చిన వారి వివరాలు తనకు తెలియపరిస్తే 25 వేల రూపాయలు కానుక ఇస్తానని MLA నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు సొంత పార్టీ కార్యకర్తలైనా, అధికారులైనా, ఎవరైనా సరే పేద ప్రజల వద్ద లంచం తీసుకున్నట్లు తెలిస్తే వారిపై కఠినచర్యలు ఉంటాయని కేసులు నమోదు చేయడంతో పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
వరంగల్ పశ్చిమ నియోజక వర్గం పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు.. వారంతా ఆనందంతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్న సమయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇండ్లు మంజూరు చేస్తామని, బిల్లులు ఇప్పిస్తామని నమ్మించి మీ వద్దకు ఎవరైనా బ్రోకర్లు ఫైరవీ కారులు వస్తే వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దని లబ్ధిదారులకు సూచించారు.. ఎవరైనా లంచం తీసుకున్నట్లు తెలిస్తే వారిపైన కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.
లంచం తీసుకున్న వారి వివరాలు తనకు తెలియపరిస్తే వారికి 25 వేల రూపాయల కానుక ఇస్తానని ప్రకటించారు.. ప్రతి పేదవాడికి ఉచితంగా ఇళ్ళు కట్టించాలనేదే ప్రభుత్వ సంకల్పమని ఇల్లు లేని ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలి.. తప్ప దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు సొంత పార్టీలోని కొందరు దళారులు, బ్రోకర్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి..వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడంతో అది అలాంటి అక్రమార్కులకు వెన్నులో మనకు పుడుతుంది.