హీరోహీరోయిన్స్ లేరు.. 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన సినిమా.. బడ్జెట్ 4 కోట్లే..

హీరోహీరోయిన్స్ లేరు.. 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన సినిమా.. బడ్జెట్ 4 కోట్లే..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
కేవలం ఐదు రోజుల్లోనే ఇది రూ. 30 కోట్ల భారీ వసూళ్లను సాధించింది.

2025లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు విడుదలై భారీ విజయాన్ని రాబట్టాయి. ‘ఛావా’, ‘జురాసిక్ వరల్డ్ రీ-బర్త్’, ‘సితారే జమీన్ పర్’, ‘సైయారా’ వంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది.

2025లోనే అతిపెద్ద హిట్ మూవీఇది. ఈ సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు. కానీ ఈ సినిమాను కొత్త రూపంలో అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా పేరు ‘మహావతార్ నరసింహ’. ఇది యానిమేటెడ్ పౌరాణిక చిత్రం. ఇది జూలై 25న విడుదలైంది.

కేవలం రూ.4 కోట్లతో నిర్మించిన ఈ సినిమా విడుదలైన 5 రోజుల్లోనే ఇప్పటివరకు దాదాపు 30 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు 1.75 కోట్లు, రెండవ రోజు 4.6 కోట్లు, మూడవ రోజు 9.5 కోట్లు, నాల్గవ రోజు 6 కోట్లు, ఐదవ రోజు 7.7 కోట్లు వసూలు చేసింది.

ఇప్పుడు ఈ సినిమా భారతదేశంలో 29.55 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం IMDb లో 9.7 ఆకట్టుకునే రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ చిత్రంలో ఏ స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినప్పటికీ జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది.

ఇప్పుడు ఈ సినిమా భారతదేశంలో 29.55 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం IMDb లో 9.7 ఆకట్టుకునే రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ చిత్రంలో ఏ స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినప్పటికీ జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు