డిగ్రీ అర్హతతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరో 4 రోజులే గడువు..

డిగ్రీ అర్హతతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరో 4 రోజులే గడువు..

దేశ వ్యాప్తంగా ఉన్న పలు LIC బ్రాంచుల్లో అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 841 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ గడువు సమీపించింది..

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC).. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 841 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ గడువు తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు సెప్టెంబర్‌ 8, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి, అర్హత కలిగిన వారు ఎవరైనా తుది గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.700. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఇంటిమేషన్‌ ఛార్జెస్‌ కింద రూ.85 చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 3, 2025న నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్ష నవంబర్‌ 8, 2025న నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.88,635 నుంచి రూ.1,69,025 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఆగస్టు 16, 2025.
ఆన్‌లైన్‌ దరఖస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 8, 2025.
ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ: అక్టోబర్‌ 3, 2025.
మెయిన్స్‌ రాత పరీక్ష తేదీ: నవంబర్‌ 8, 2025.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు