కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫర్ కామర్స్ థగ్ లైఫ్ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. కమల్ హాసన్ కు కర్ణాటకలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని.. అందుకే థగ్ లైఫ్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే భాష వివాదంపై కమల్ హాసన్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది.
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో కమల్ హాసన్. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రం థగ్ లైఫ్. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 5న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే కొన్నిరోజులుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఇటీవల చెన్నైలో జరిగన ఈవెంట్ లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీంతో కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను విడుదల చేసేది లేదంటూ హిచ్చరించింది కర్ణాటక్ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్. ఈ పరిస్థితిలో, కమల్ హాసన్ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నరసింహులుకు ఒక లేఖ రాశారు. “థగ్ లైఫ్ ఆడియో లాంచ్లో నేను కన్నడ భాష గురించి తక్కువ చేసి మాట్లాడలేదు. నేను తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలను సమానంగా చూస్తాను. తమిళం లాగే, కన్నడ భాషకు కూడా గర్వకారణమైన సాహిత్య సాంస్కృతిక వారసత్వం ఉంది. కానీ నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఎంతో బాధపడ్డాను” అని రాసుకొచ్చారు.
మరోవైపు థగ్ లైఫ్ సినిమాపై కర్ణాటకలో విధించిన నిషేదాన్ని ఎత్తివేయాలని కోరుతూ నటుడు కమల్ హాసన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు సైతం కమల్ హాసన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమపణ చెప్పేందుకు ఎందుకు సిద్ధంగా లేరని ప్రశ్నించింది. ప్రజల మనోభావాలను ఎందుకు తక్కువ చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ కేసుపై జూన్ 3న విచారణ జరిగిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచరం ప్రకారం.. కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ థగ్ లైఫ్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలియజేసింది. కర్ణాటకలో కమల్ హాసన్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీని కారణంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని.. సమస్యను త్వరగా పరిష్కరించుకుని సినిమాను రిలీజ్ చేసేందుకు ఒక దారి చూడాలని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నరసింహలు అన్నారు.