ప్రస్తుత ఫాస్ట్లైఫ్, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ దేశంలో కరోనా చేసిన కల్లోలం తర్వాత చాలా మంది ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. రోజూ జిమ్కు వెళ్లడం, వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం వంటి అలవాట్లను అలవర్చుకుంటున్నారు.ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాలు పెంచే కూరగాయాలు, పండ్లు తినడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. మీకు కూడా మంచి ఆరోగ్యం కావాలంటే.. మీ గార్డెన్లో ఈ ఐదు రకాల పండ్ల మొక్కలను నాటండి. దీని వల్ల ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయకుండా మీరు తాజా పండ్లను పొందవచ్చు. ఇవి మీ ఆరోగ్యానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయి.
పండ్లలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన పండు ఏదైనా ఉందంటే అది మామిడే అని చెప్పవచ్చు. ఈ పండులో రుచితో పాటు అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్ల చెట్టును మనం పెరట్లో పెంచుకోవడం చాలా ఈజీ. ఈ చెట్టు చాలా తక్కువ భూమిలో పెరుగుతుంది. అలాగే ఎక్కువ పండ్లను అందిస్తుంది. బయట దొరికే హైబ్రిడ్ పండ్ల కన్నా.. మన ఇంట్లో కాచే ఈ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి
మన పెరట్లో పెంచుకోవడానిక సులభమైన చెట్టు బత్తాయి. ఈ చెట్టు తక్కువ సమయంలో పెరిగి పండ్లను అందిస్తుంది. వీటి పండ్ల ద్వారా చేసిన రసాన్ని రోజూ తాగడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బయట మార్కెట్లో దొరికే హైబ్రిడ్ పండ్లు కొన్ని సార్లు మన ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. కానీ ఇలా ఇంట్లోనే పండే వాటి వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు.
ఇక మరో పండ్ల చెట్టు విషయానికి వస్తే జామ చెట్టు. దీన్ని కూడా మన పెరట్లో ఈజీగా పెంచుకోవచ్చు. ఇవి కూడా త్వరగా కాపునకు వస్తాయి. జామ పండ్లను తినడం ద్వారా మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మదుమేహ వ్యాధి గ్రస్తులకు కూడా ఇది మంచి ఎంపిక
ఇక మన పెరట్లో పెంచుకునే మరో చెట్టు బొప్పాయి. ఈ చెట్టును కేవలం మూడు అడుగుల భూమిలోనే నాటవచ్చు. ఈ చెట్టు నుంచి రెండు విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి. వీటి పండ్లు, ఆకులు రెండూ కూడా మనకు ఉపయోగపడుతాయి. బొప్పాయిని పండు మన ఆరోగ్యానికి చాలా రకాలు ఉపయోగపడుతుంది.
ఇక పిల్లల నుంచి పెద్దల వరకు అందిరికీ ఇష్టమైన ,చవకౌన పండు ఏదైనా ఉందంటే అది అరటి పండు మాత్రమే. వీటిని ఎక్కువగా తోటలో పెంచుతారు. కానీ మన పెరట్లో కూడా ఈ చెట్టును పెంచుకోవచ్చు. ఈ చెట్టు తక్కువ ప్లేస్ను తీసుకున్నప్పటికీ ఎక్కువ పండ్లను అందిస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)