బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఆల్టైమ్ హైకి ఎగబాకి.. లక్ష మార్కుకు చేరువైంది.. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక ఉద్రిక్తతలతో బంగారం రేటు నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉంది.. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు, ఇంకా అంతర్జాతీయంగా నెలకొన్న పలు పరిణామాలతో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది.
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఆల్టైమ్ హైకి ఎగబాకి.. లక్ష మార్కుకు చేరువైంది.. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక ఉద్రిక్తతలతో బంగారం రేటు నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉంది.. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు, ఇంకా అంతర్జాతీయంగా నెలకొన్న పలు పరిణామాలతో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి ధర 98వేలకు చేరువలో ఉంది. తాజాగా కూడా బంగారం ధర పెరిగింది. 19 ఏప్రిల్ 2025 శనివారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,460, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.97,590 గా ఉంది. వెండి కిలో ధర రూ.99,900 లుగా ఉంది. కాగా.. బంగారం పది గ్రాములపై దాదాపు రూ.270 మేర ధర పెరిగింది. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇంకా ప్రతిరోజూ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,460, 24 క్యారెట్ల ధర రూ.97,590 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,460, 24 క్యారెట్ల ధర రూ.97,590గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,610, 24 క్యారెట్ల ధర రూ.97,740 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.89,460, 24 క్యారెట్ల ధర రూ.97,590 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.89,460, 24 క్యారెట్ల రేటు రూ.97,590 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.89,460, 24 క్యారెట్ల ధర రూ.97,590 గా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1,09,900
విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,09,900
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.99,900
ముంబైలో రూ.99,900
బెంగళూరులో రూ.99,900
చెన్నైలో రూ.1,09,900 లుగా ఉంది.
కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.