కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు

కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు

కేటీఆర్‌‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని బల్మూరి వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదులో.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. దీంతో కేటీఆర్‌పై BNS 353(2), 352 సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు పోలీసులు.

మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేశారని బల్మూరి వెంకట్ మరో ఫిర్యాదులో ఆరోపించారు. ఈ పోస్ట్‌లలో అభ్యంతరకరమైన భాష, తప్పుదారి పట్టించే కథనాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు హాని కలిగించి.. శాంతికి భంగం కలిగించాలనే ఉద్దేశ్యంతో కౌశిక్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై కౌశిక్ రెడ్డిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67, BNS సెక్షన్లు 353(2), 352 కింద కేసు నమోదు అయింది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు