అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి భారతీయ మహిళ జాహ్నవి – మన తెలుగమ్మాయే

అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి భారతీయ మహిళ జాహ్నవి – మన తెలుగమ్మాయే

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి, భారతీయ తొలి తెలుగు మహిళగా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నారు. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ కాండిడేట్ (ASCAN)గా ఎంపికయ్యారు. 2029లో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో ఐదు గంటల పాటు జాహ్నవి రోదసిలో గడపనున్నారు.

అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ తొలి తెలుగు మహిళగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి ఘనత సాధించారు. అంతరిక్ష యానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు అలాంటి అసాధ్యాన్ని జాహ్నవి సుసాధ్యం చేయబోతుంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ కాండిడేట్ (ASCAN)గా ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక మిషన్‌కు నాసా మాజీ వ్యోమగామి విలియం మెక్ ఆర్థర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు. భారతదేశంలో పుట్టి, ఇక్కడే నివసించిన మహిళ నేరుగా ఇంతవరకు అంతరిక్ష యానానికి ఎంపిక కాలేదు. అయితే టైటాన్ స్పేస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ పూర్తిచేసిన జాహ్నవి ఈ స్పేస్ మిషన్‌కు అర్హత సాధించారు.

టైటాన్ స్పేస్ రోదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్లో అంతరిక్ష ప్రయోగ, వాణిజ్య పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదబోతుంది. దీనిలో భాగంగా తొలుత కొద్దిమంది అంతరిక్ష పరిశోధక వ్యోమగా ములు, పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెలుతున్నారు. 2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్ర బృందంలో భారత్ నుంచి జాహ్నవి పాల్గొనబోతున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆమె ఐదు గంటల పాటు అంతరిక్షంలో గడపుతుంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది అమెరికాతో పాటు పలు దేశాల్లో మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. ఈ మిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.

జాహ్నవి 2021లో నాసా నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్’కు భారత్ తరపున ఎంపికై రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా జాహ్నవి 2026 నుంచి మూడేళ్లపాటు టైటాన్ స్పేస్ ASCAN ప్రోగ్రామ్‌లో కఠినమైన వ్యోమగామి శిక్షణ పొందనుంది. ఈ శిక్షణలో ఫ్లైట్ సిమ్యూలేషన్, స్పేస్‌ క్రాఫ్ట్ ప్రొసీజర్లు, సర్వైవల్ ట్రైనింగ్, మెడికల్, సైకాలజికల్ అసెస్‌మెంట్లు ఉండనున్నాయి. 2029లో ఐదు గంటలపాటు సాగనున్న ఈ ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్‌ ద్వారా శాస్త్రీయ పరిశోధన, మానవ అంతరిక్ష పరిశోధనకు ఓ కొత్త దిక్సూచి ఏర్పడనుందని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

జాహ్నవి పాలకొల్లులో జన్మించి అక్కడే పెరిగింది. బీటెక్ పూర్తిచేసిన ఆమెకు చిన్ననాటి నుండే అంతరిక్షం పట్ల చాలా ఆసక్తి. ఇందులో భాగంగానే 2022లో పోలాండ్‌ లోని అనలాగ్ వ్యోమగాముల శిక్షణ కేంద్రం (AATC)లో శిక్షణ పొందిన జాహ్నవి, అతి చిన్న వయస్సులోనే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, NASA నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది జాహ్నవి. ఇప్పటికే చిన్న రాకెట్ అయిన ‘సెస్నా 171 స్కైహాక్’ ను విజయవంతంగా నడిపి రికార్డ్ సృష్టించింది. జీరో గ్రావిటీ, మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, అండర్‌ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందింది కూడా. ఆమె 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించింది. అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన దాదాపు అన్ని నైపుణ్యాలను ఆమె శిక్షణ పొందింది. స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్‌డ్ లెవెల్ ట్రైనింగ్ పూర్తి చేయడం ద్వారా కూడా నీటి లోతుల్లో గ్రావిటీ లేని పరిసరాల్లో పనిచేయగల సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంది.

జాహ్నవి ఈ ఘనత సాధించడానికి తన అమ్మమ్మ లీలావతి కారణం. తల్లిదండ్రులు కువైట్‌లో ఉండడంతో.. అమ్మమ్మ దగ్గర పెరిగిన జాహ్నవి చందమామ కథలు వింటూ పెరిగింది. ఆ కథలే ఆమె మనసులో అంతరిక్షం పట్ల ఆసక్తిని రేపాయని కుటుంబ సభ్యులు చెబుతారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు