తిరుమల కల్యాణ వేదిక ఎప్పుడూ కిటకిటే.. ఎన్నివేల జంటలు ఒక్కటయ్యాయో తెలుసా?

తిరుమల కల్యాణ వేదిక ఎప్పుడూ కిటకిటే.. ఎన్నివేల జంటలు ఒక్కటయ్యాయో తెలుసా?

ఇక కరెంటు బుకింగ్, ఆన్ లైన్ లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి. వధువుకు 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్ళు నిండి వుండాలి. రెండో పెళ్లి, ప్రేమ పెళ్ళిళ్ళు ఇక్కడ జరుప బడవు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 0877- 2263433 సంప్రదించవచ్చని టిటిడి చెబుతోంది. ఇందుకోసం..

తిరుమల. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం. నిత్యం పచ్చ కళ్యాణం నిత్యతోరణమే. అందుకేనేమో తిరుమలలోని కళ్యాణ వేదికకు నూతన వదూవరుల నుండి విశేష స్పందన లభిస్తోంది. టిటిడి నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వదూ వరులు పోటెత్తుతున్న పరిస్థితి ఉంది. 9 ఏళ్లుగా కళ్యాణ వేదికలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. 2016 ఏప్రిల్ 25 నుంచి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద టిటిడి ఉచితంగా వివాహాలు నిర్వహిస్తోంది. తిరుమలలోని కల్యాణ వేదికలో 2016 ఏప్రిల్ 25 నుండి 2025 మే 1 వరకు 26,214 వివాహాలు జరిగాయి. ఇందులో భాగంగా పురోహితుడు, మంగళ వాయిద్యంతో పాటు పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను టిటిడి ఉచితంగా అందిస్తుంది. వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వదూవరులే తీసుకురావాల్సి ఉంటుంది. వివాహానికి వదూవరుల తల్లిదండ్రులు తప్పని సరిగా హాజరుకావాల్సి ఉంటుంది. పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంది.

పెళ్లి తరువాత ప్రత్యేక దర్శనం..

ఇక కళ్యాణ వేదిక లో పెళ్లి చేసుకున్న వధూవరులకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. పెళ్లి అనంతరం రూ.300ల ప్రత్యేక ప్రవేశం ద్వారా వధూవరులకు, ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ వద్ద గల క్యూలైన్ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దర్శనానంతరం ఉచితంగా 6 మందికి గాను 6 లడ్డూలను లడ్డూ కౌంటర్ లో పొందవచ్చు.

ఆన్ లైన్ లో కళ్యాణ వేదిక బుకింగ్.

తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహాలు చేసుకునేందుకు ఆన్ లైన్ లో కల్యాణవేదిక స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9 నుండి నూతన వదూవరులకు టిటిడి కల్పించింది. ఇందుకోసం తమ సమీప ప్రాంతాల్లోని నెట్ సెంటర్ లో టిటిడి https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న కల్యాణ వేదిక కాలమ్ లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదు చేయాలి. వధూవరులు తప్పని సరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమే కాక ఆధార్ కార్డులను అప్లోడ్ చేయాలి. వయసు ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా పదో తరగతి మార్క్స్ లిస్ట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదంటే పంచాయతీ కార్యదర్శి, మునిసిపల్ అధికారుల నుండి బర్త్ సర్టిఫికేట్ ను జత చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్లోడ్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ జారీ అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకునే వారు అక్నాలెడ్జ్మెంట్ పత్రాన్ని తీసుకుని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణ వేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించు కోవాల్సి ఉంటుంది.

ఇక కరెంటు బుకింగ్, ఆన్ లైన్ లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి. వధువుకు 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్ళు నిండి వుండాలి. రెండో పెళ్లి, ప్రేమ పెళ్ళిళ్ళు ఇక్కడ జరుప బడవు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 0877- 2263433 సంప్రదించవచ్చని టిటిడి చెబుతోంది.

వివాహ రిజిస్ట్రేషన్ కొరకు.

ఇక తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వధూవరులు, తమ వివాహన్ని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ వివాహ సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయమును కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకోసం నూతన వదూవరులు తమ వయస్సు ధృవ పత్రములు, నివాస ధృవ పత్రము, వివాహము ఫోటో, పెండ్లి పత్రిక, కళ్యాణ మండపము రసీదు పత్రాలను, వీటితో పాటు అవివాహితులుగా అన్ మ్యారీడ్ సర్టిఫికెట్ ను స్థానిక ఎమ్మార్వో నుండి తీసుకుని కల్యాణ వేదిక వద్ద అధికారులకు సమర్పించాలి. ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదంటే ఫోన్ నంబరు 0877- 2263433 కు సంప్రదించవచ్చని టీటీడీ చెబుతోంది. తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు