ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అంబుల వైష్ణవిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె సేవాభావానికి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ, “అమరావతి అభివృద్ధి నా కల. రాజధాని నిర్మాణానికి కావాల్సిన మద్దతును రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సేకరించేందుకు నా వంతు కృషి చేస్తాను” అని తెలిపింది.
అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి నియమితులైంది. స్థానికంగా అమరావతి కే చెందిన వైష్ణవి ఈ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిశారు. చిన్న వయస్సులోనే సామాజిక బాధ్యతను స్వీకరించి అమరావతి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నందుకు సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
అమరావతికి 50 లక్షలు విరాళంగా ఇచ్చిన వైష్ణవి
అత్యంత చిన్న వయస్సులోనే అమరావతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వైష్ణవి, రాజధానికి నిధుల సమీకరణలోనూ కీలక పాత్ర పోషించారు. గతంలోనే రూ. 50 లక్షలు విరాళంగా అందించిన ఆమె, అమరావతి నిర్మాణం కోసం మరింత విరాళాలు సమీకరించాలనే సంకల్పాన్ని సీఎం ముందు వ్యక్తం చేశారు.